Munugode: మునుగోడు కాల్పుల కేసు.. వివాహేతర సంబంధమే కారణం: ఎస్పీ
తుపాకితో కాల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా సుపారీతో పాటు తుపాకి కల్చర్ వెలుగులోకి రావడంతో అన్ని వర్గాల వారు ఉలిక్కిపడ్డారు. మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో నిమ్మలస్వామిపై ...
నల్గొండ: తుపాకితో కాల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా సుపారీతో పాటు తుపాకి కల్చర్ వెలుగులోకి రావడంతో అన్ని వర్గాల వారు ఉలిక్కిపడ్డారు. మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో నిమ్మలస్వామిపై ఈనెల 4న జరిగిన హత్యాయత్నం కేసులో 9మందిని అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నట్టు ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. నిందితుల నుంచి ఒక పిస్టల్, 9 చరవాణిలు, రూ.4,500 నగదు, ప్రామిసరీనోట్లు, రెండు బ్యాంకు చెక్బుక్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు.
మర్రిగూడ మండలం తుమ్మడపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఉంటూ నార్కట్పల్లి మండలం బి.వెల్లంలా గ్రామంలోని జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో మిడ్ డే మీల్స్ వర్కర్గా పనిచేస్తున్న ఓ మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరి సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఆమె భర్త నిమ్మలస్వామిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. దీనికోసం ముందుగా యాచారం మండలం మాల్ ప్రాంతానికి చెందన కనక రామస్వామితో రూ.3లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్గా రూ.1.70లక్షలు తీసుకున్న రామస్వామి మునుగోడులో నిమ్మల రామస్వామి దుకాణం పక్కనే మరో దుకాణం అద్దెకు తీసుకొని అందులో పనిచేస్తున్న మొహినుద్దీన్తో పరిచయం పెంచుకున్నాడు. దీంతో పాటు చింతపల్లి మండలం ఇంజమూరు గ్రామానికి చెందిన పోల్గిరి, రత్నాల వెంకటేశ్లతో కలిసి హత్య చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. బాలకృష్ణ అంతటితో ఆగకుండా మరోసారి హైదరాబాద్లో ప్లంబర్గా పనిచేస్తున్న యూసుఫ్తో కలిసి పథకం వేసి రూ.12లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈసారి రూ.5లక్షలు సుపారీ ఇచ్చాడు. యూసుఫ్ తన స్నేహితుడు జహంగీర్ పాష, ఆసిఫ్ ఖాన్లు కలిసి అప్పటికే బిహార్లో పిస్టల్ కొనుగోలు చేసుకుని ఉన్న అబ్దుల్ రహమాన్తో కలిసి ఈనెల 4న స్వామిపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. వీరిలో యూసుఫ్ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం