Hyderabad: మాదకద్రవ్యాల సరఫరా కేసు.. కీలక సూత్రధారి అరెస్టు
మాదకద్రవ్యాల సరఫరా కేసులో కీలక సూత్రధారిని నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఎడ్విన్ను నార్కోటిక్ విభాగం పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్కు మాదకద్రవ్యాల సరఫరాలో ఎడ్విన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
హైదరాబాద్: మాదకద్రవ్యాల సరఫరా కేసులో కీలక సూత్రధారిని నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఎడ్విన్ను నార్కోటిక్ విభాగం పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్కు మాదకద్రవ్యాల సరఫరాలో ఎడ్విన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నారాయణ బోర్కర్ అనే వ్యక్తిని మూడు నెలల క్రితం నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ హైదరాబాద్లో సరఫరా చేయడంలో నారాయణ బోర్కర్ది కీలక పాత్ర. తను ఇచ్చిన సమాచారం మేరకు నార్కోటిక్ విభాగం పోలీసులు గోవాలో పలువురిపై నిఘా పెట్టారు. గత మూడు నెలలుగా ఎడ్విన్ తప్పించుకొని గోవాలో తిరుగుతున్నాడు. పక్కా ప్రణాళికతో 15 రోజులుగా అక్కడే ఉండి స్థానిక పోలీసులు ఎడ్విన్పై నిఘా పెట్టారు. ఎట్టకేలకు ఎడ్విన్ను పట్టుకున్న పోలీసులు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.