రూ.3వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం!
అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్ను భారత నావికాదళం చేధించింది. దాదాపు రూ.3వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.
అరేబియా తీరంలో పట్టుకున్న భారత నేవి
దిల్లీ: అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్ను భారత నావికాదళం ఛేదించింది. దాదాపు రూ.3వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు శ్రీలంక పౌరులను అరెస్టు చేసినట్లు భారత నేవీ అధికారులు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో ఇంతటి విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం తొలిసారని అధికారులు పేర్కొన్నారు.
అరేబియా సముద్రంలో ‘సువర్ణ’ నౌకలో గస్తీ నిర్వహిస్తోన్న భారత నావికా దళ సిబ్బంది అనుమానాస్పదంగా తిరుగుతోన్న ఓ పడవ కనిపించింది. పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు భావిస్తోన్న ఆ నౌక తర్వాత కొచ్చి తీరానికి చేరుకుంది. అదే సమయంలో అనుమానం వచ్చిన భారత నేవీ సిబ్బంది పడవపై దాడి చేసి గాలించారు. అందులో దాదాపు 300కిలోల మాదకద్రవ్యాలను గుర్తించారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3వేల కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఐదుగురిని అరెస్టు చేసిన అధికారులు వారిని విచారిస్తున్నారు. పాకిస్థాన్లోని మాక్రాన్ తీరం నుంచి భారత్, మాల్దీవులు, శ్రీలంక కేంద్రాలుగా ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సాగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అరెస్టు చేసిన వారిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), సథరన్ నావెల్ కమాండ్తో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు కలిసి విచారిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇంతటి భారీ స్థాయిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా గతంలోనూ వెలుగుచూసింది. ఈ అక్రమ వ్యాపారం భారత్కు రెండు వైపులా వేళ్లూనుకుంది. ఒక వైపు అఫ్గానిస్థాన్-పాకిస్థాన్-ఇరాన్లతో కూడిన బంగారు నెలవంక (అంతర్జాతీయంగా దీనికి ఉన్న పేరు) ద్వారా, మరోవైపు బర్మా-లావోస్-థాయిల్యాండ్తో కూడిన బంగారు త్రికోణంలో జరుగుతున్నాయి. ఇంతకుముందు ముంబయిలో పట్టుకొన్న రూ.1,000 కోట్ల విలువైన హెరాయిన్ అఫ్గానిస్థాన్ మీదుగా ఇరాన్ వచ్చి అక్కడి నుంచి భారత్ పోర్టుకు చేరినట్లు అధికారులు గుర్తించారు. భూ, జల మార్గాలను ఉపయోగించుకొని స్మగ్లర్లు వీటిని భారత్తో పాటు పలు దేశాలకు చేరుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి