NEET student suicide: ఒత్తిడి తాళలేక.. ఉరి వేసుకున్న నీట్ విద్యార్థి
ఒత్తిడి తట్టుకోలేక నీట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల వ్యవధిలోనే మరో విద్యార్థి మరణించాడు.
జైపూర్: ఒత్తిడికి తట్టుకోలేక నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ (NEET) విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ (Rajasthan)లోని కోటా (Kota) పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర్ప్రదేశ్ (Uttar pradesh)లోని బులంద్షహర్ (Bulandshahr) జిల్లా ఖుర్జా (Khurja)పట్టణానికి చెందిన 15 ఏళ్ల ధనుష్ కుమార్ శర్మ ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రాజస్థాన్లోని కోటా పట్టణంలో ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ నీట్ పరీక్ష కోసం నెల రోజులుగా స్థానిక కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్నాడు. బుధవారం రాత్రి భోజనం చేసి తన గదికి వెళ్లిపోయాడు. అదే సమయంలో తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోను చేసినా అతడు స్పందించలేదు. మరుసటి రోజు ఉదయం మళ్లీ ఫోను చేసినా తీయలేదు. దాంతో కంగారుపడిన తల్లిదండ్రలు వారి ప్రాంతం నుంచి కోచింగ్ తీసుకుంటున్న మరో అబ్బాయికి ఫోను చేసి తమ కుమారుడి గదికి వెళ్లి చూడమని అడిగారు.
స్నేహితుడు, హాస్టల్ వార్డెన్ ఎంత పిలిచినా తలుపులు తెరవలేదు. దీంతో అంతాకలిసి తలుపును బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా ధనుష్ ఫ్యాన్కు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. మృతుడి గదిలో ఎలాంటి సూసైడ్ నోటు కనిపించలేదు. తల్లిదండ్రలు వచ్చిన వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తామని తెలిపారు. అక్కడే కోచింగ్ తీసుకుంటున్న బెంగళూరుకు చెందిన మహమ్మద్ నాసిద్(22) అనే విద్యార్థి నాలుగు రోజుల క్రితం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కోటా పట్టణంలో ఉన్న వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుని ఏడుగురు మరణించారు. అంతేకాకుండా 15 మంది ఆత్మహత్యకు ప్రయత్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే