Crime news: ఆ బాలికపై యాసిడ్‌ దాడి చేసింది మేనమామే..

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో మైనర్‌ బాలికపై యాసిడ్‌ దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి

Updated : 07 Sep 2022 06:06 IST

నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వెల్లడి

నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో మైనర్‌ బాలికపై యాసిడ్‌ దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, 14 ఏళ్ల బాలికపై దాడికి పాల్పడింది ఆమె మేనమామ నాగరాజేనని పోలీసులు వెల్లడించారు. డబ్బు కోసమే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలిపారు. ఈ ఘటనపై నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరనాథ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బాలికపై అత్యాచారం జరగలేదని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు చెప్పారు. నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై డబ్బు కోసమే ఈ కిరాతకానికి పాల్పడినట్టు తెలిపారు. ఈ కేసును విచారించి నిందితుడిని త్వరలోనే పట్టుకొని కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోనున్నట్టు డీఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని