Crime News: ఫోను ఎక్కువగా మాట్లాడుతోందని అత్త మందలింపు.. నవ వధువు ఆత్మహత్య

ఎక్కువగా ఫోను మాట్లాడుతోందని అత్త మందలించడంతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.

Published : 17 Mar 2022 01:30 IST

హైదరాబాద్‌: ఎక్కువగా ఫోను మాట్లాడుతోందని అత్త మందలించడంతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని చోటుచేసుకుంది. బోరబండలోని భరత్‌నగర్‌కు చెందిన పవన్‌తో సికింద్రాబాద్‌ అడిక్మెట్‌కు చెందిన శిల్ప(22) మూడు నెలల క్రితం వివాహం జరిగింది. అధికంగా ఫోన్‌ మాట్లాడటంపై అత్తాకోడళ్ల మధ్య వివాదం చెలరేగింది. ఈక్రమంలో శిల్ప ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శిల్ప గర్భం దాల్చినట్లు సమాచారం. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని