NIA: హైదరాబాద్‌ పాతబస్తీలో ఎన్‌ఐఏ సోదాలు

నగరంలోని పాతబస్తీలో జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) సోదాలు చేపట్టింది. ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన దర్జీ కన్హయ్యలాల్‌ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ బృందం హైదరాబాద్‌కు వచ్చింది. 

Published : 06 Jul 2022 01:58 IST

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) సోదాలు చేపట్టింది. ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన దర్జీ కన్హయ్యలాల్‌ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ బృందం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ హత్య కేసులో అరెస్టు అయిన నిందితుల సెల్‌ఫోన్‌లో బిహార్ వాసి ఫోన్‌ నంబర్‌ ఉంది. దీంతో ఈ హత్యతో అతడికి గల సంబంధంపై ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అతడు నగరంలోని సంతోష్ నగర్‌లో ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయనికి తరలించి విచారిస్తున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని