Aryan khan: ఆర్యన్కు బెయిల్ కోసం తప్పని నిరీక్షణ.. వాదనలు నేటికి వాయిదా
మాదకద్రవ్యాల కేసులో బెయిల్ కోసం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసులో ఆర్యన్తో పాటు ......
ముంబయి: మాదకద్రవ్యాల కేసులో బెయిల్ కోసం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్యన్తో పాటు అర్బాజ్ మర్చెంట్, మూన్మూన్ ధమేచా దాఖలు చేసిన బెయిలు పిటిషన్పై వరుసగా రెండో రోజూ సుదీర్ఘ వాదనలు కొనసాగినా ఎవరికీ బెయిల్ రాలేదు. ఈ కేసులో వాదనలను గురువారం వింటామని వెల్లడించిన బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కేసు విచారణను కొనసాగిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఎన్డబ్ల్యూ సాంబ్రే వెల్లడించారు. మరోవైపు, ఎన్సీబీ తరఫున ఏఎస్సీ అనిల్ సింగ్ కోర్టుకు హాజరయ్యారు. నిందితుల తరఫున ముకుల్ రోహత్గీ, అమిత్ దేశాయ్, అలీ కాశీఫ్ ఖాన్ దేశ్ముఖ్ వాదనలు ముగించగా.. ఇంకా ఎన్సీబీ తరఫు న్యాయవాది వాదనలు వినాల్సి ఉంది. అయితే, ఇందుకు మరింత సమయం పట్టడంతో విచారణను రేపు పూర్తి చేసేందుకు ప్రయత్నిద్దామన్న జడ్జి.. ఈ కేసు తదుపరి వాదనలను గురువారానికి వాయిదా వేశారు.
మూన్మూన్ని బలిపశువుని చేశారు..
ఆర్యన్ఖాన్ తరఫున రెండో రోజు కూడా మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న అర్బాజ్ మర్చెంట్ తరఫున అమిత్ దేశాయ్, మూన్మూన్ ధమేచా తరఫున అలీ కాశీఫ్ ఖాన్ దేశ్ముఖ్ వాదించారు. ఈ కేసులో నిందితులను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ముంబయి క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు ఇచ్చిన అరెస్టు మెమోలో అరెస్టుకు సరైన ఆధారాలు చూపడంలో విఫలమయ్యారని ముకుల్ రోహత్గీ తెలిపారు. ఆర్యన్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎన్సీబీ కుట్ర సిద్ధాంతానికి బలం చేకూర్చేలా వాట్సాప్ చాట్లు లేవని అర్బాజ్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ కోర్టుకు తెలిపారు. నిందితులు ముంబయిలోనే ఉన్నందున ఎన్సీబీ విచారణకు ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటారని చెప్పారు. అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కేసులో మూన్మూన్ ధమేచాని బలిపశువుని చేశారని ఆమె తరఫు న్యాయవాది అలీ కాశీఫ్ ఖాన్ దేశ్ముఖ్ అన్నారు. ఆమె గదిలోకి వెళ్లిన రెండు-మూడు నిమిషాల్లోనే అరెస్టు చేశారని తెలిపారు. ఆమెతో పాటు సౌమ్య సింగ్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
నగదుంటేనే రైడ్ రైట్
-
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్