దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

పడుకునేముందు చాలా మంది ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టడం, తమ దిండు కింద పెట్టుకుని పడుకోవడం చేస్తుంటారు. అయితే దిండుకింద...

Published : 09 Nov 2020 02:03 IST

కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన బాధితుడు

తిరువనంతపురం: పడుకునేముందు చాలా మంది ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టడం, తమ దిండు కింద పెట్టుకుని పడుకోవడం చేస్తుంటారు. అయితే దిండుకింద పెట్టిన ఓ ఫోన్‌ పెలిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కొల్లాం జిల్లాలో ఓ వ్యక్తి తన నోకియా ఫీచర్‌ ఫోన్‌ను రాత్రిపూట పడుకునే ముందు దిండు కింద పెట్టి నిద్రకు ఉపక్రమించాడు. ఒక్కసారిగా ఫోన్‌ పేలడంతో అతడి భుజం, ఎడమ మోచేతికి గాయాలు అయ్యాయి. పడుకునేముందు చొక్కా ధరించకపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 

సంఘటనకు సంబంధించి బాధితుడు వివరాల ప్రకారం.. ‘నేను త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుడిని తన గమ్యస్థానం వద్ద వదిలిపెట్టి ఇంటికి వచ్చా. అప్పటికే బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నా. అయితే ఒక్కసారిగా శబ్దం రావడంతో మేల్కొన్నా. భుజం వద్ద నొప్పిగా అనిపించింది. దిండు కాలిపోతూ ఉండగా ఫోన్‌ నుంచి నిప్పులు వస్తున్నాయి. వెంటనే ఫోన్‌ను దూరంగా నెట్టేసి ఆసుపత్రికి వెళ్లాను’ అని వివరించాడు. దిండు కింద ఉంచేటప్పుడు ఛార్జింగ్‌ పెట్టలేదని, అయినప్పటికీ బ్యాటరీ ఉబ్బిపోయి పేలిపోయిందని బాధితుడు పేర్కొన్నాడు. పేలడానికి గల కారణం ఏంటో తెలియడం లేదని, నోకియా సంస్థ సమస్యను గుర్తించి పరిష్కరించాలని బాధితుడు కోరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని