11మంది మహిళల్ని చంపిన సీరియల్ కిల్లర్.. చివరకు!
ఒకరు.. ఇద్దరు కాదు.. మొత్తం 11 మంది మహిళల్ని హతమార్చిన కేసులో మరణ శిక్ష పడిన ఓ సీరియల్ కిల్లర్ అంతుచిక్కని ....
క్లేవ్లాండ్: 11 మంది మహిళల్ని హతమార్చిన కేసులో మరణశిక్ష పడిన ఓ సీరియల్ కిల్లర్ అంతుచిక్కని రోగంతో మరణించాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఒహైయోకి చెందిన ఆంటోనీ సోవెల్ (61)కి మహిళల్ని చంపి ఇంటి పరిసరాల్లో దాచిపెట్టిన కేసులో మరణశిక్ష పడింది. అయితే, కారాగారంలో ఉన్న అతను అంతుబట్టని రోగానికి గురైన సోమవారం ప్రాణాలు విడిచినట్టు అధికారులు తెలిపారు. అతడి మరణానికి కరోనా కారణం కాదని స్పష్టంచేశారు. వివరాల్లోకి వెళ్తే.. 2009 అక్టోబర్లో పోలీసులు ఓ అత్యాచారం కేసులో సోవెల్ను విచారించారు. ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో సోదాలు చేయగా.. రెండు మృతదేహాలను గుర్తించారు. ఆ తర్వాత మరింత విస్తృతంగా గాలించిన పోలీసులు 11మంది మహిళల అవశేషాలను వెలికితీశారు.
మహిళల్ని చంపిన కేసులో అరెస్టయిన సోవెల్పై నేరం రుజువు కావడంతో 2011లో మరణ శిక్ష పడింది. మహిళల్ని చంపిన కేసుతో పాటు ఇద్దరు మహిళలపై అత్యాచారం, మరొకరిపై అత్యాచారయత్నం కేసులో కూడా న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. జైలులో ఉన్న సోవెల్.. తనకు కింది కోర్టు విధించిన శిక్షపై పదేపదే అప్పీల్కు చేస్తూ వచ్చాడు. తనపై నేర విచారణ నిష్పక్షపాతంగా జరగలేదంటూ పిటిషన్ వేశాడు. దీనిపై గతేడాది మే నెలలో ముగ్గురు న్యాయమూర్తుల ప్యానల్ విచారించి.. అతడు చేస్తున్న ఆరోపణలపై సరైన ఆధారాలను సమర్పించడంలో విఫలమయ్యాడని పేర్కొంది. ఆరోపణలపై ఆధారాల్లేవని కొట్టివేసింది. అలాగే, తనకు శిక్ష నుంచి మినహాయింపు కోరుతూ అతడు దాఖలు చేసిన పిటిషన్ను కూడా కొట్టివేసింది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..