ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌ మృతి

ఖమ్మం జిల్లా కొనిజెర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొని ఆటో డ్రైవర్‌ మృతిచెందాడు. ఏన్కూరు వైపు నుంచి వెళుతున్న లారీ....

Published : 10 Feb 2021 11:21 IST

ఖమ్మం: ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొని ఆటో డ్రైవర్‌ మృతిచెందాడు. ఏన్కూరు వైపు నుంచి వెళుతున్న లారీ గుబ్బగుర్తి వద్ద ఆటోను ఢీకొంది. అనంతరం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలో మంటలు ఎగిసిపడి వాహనం పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. లారీ డ్రైవర్‌ వెంటనే బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం కారణంగా ఏన్కూరు-గుబ్బగుర్తి రహదారిపై గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవీ చదవండి...

మహిళల అక్రమ రవాణా ముఠా అరెస్టు

బుల్లితెర నటుడు అమర్‌ అరెస్టు
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని