వనస్థలిపురం హత్య కేసులో మరొకరు అరెస్టు

వనస్థలిపురంలోని మన్సూరాబాద్‌లో వ్యక్తిని హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన ఘటనలో పోలీసులు మరొక్కరిని అరెస్టు చేశారు. స్థానికంగా నివసించే గగన్‌దీప్‌ అగర్వాల్‌ను...

Updated : 12 Mar 2021 11:56 IST

హైదరాబాద్‌: వనస్థలిపురంలోని మన్సూరాబాద్‌లో వ్యక్తిని హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన ఘటనలో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. స్థానికంగా నివసించే గగన్‌దీప్‌ అగర్వాల్‌ను అతని భార్య నౌశిన్‌ బేగం, గగన్‌ స్నేహితుడు సునీల్‌ సహాయంతో హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో వీరిద్దరే హత్య చేసినట్టు తేలడంతో నౌశిన్‌ బేగంను అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన సునీల్‌ పరారీలో ఉండగా.. గాలింపు చేపట్టి పురానాపూల్‌ ప్రాంతంలో అతడిని అరెస్టు చేశారు. పథకం ప్రకారమే వీరిద్దరూ కలిసి గగన్‌తో మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక దారుణంగా హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. వారికి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని