తిరిగి జైలుకు వెళ్లేందుకు బెదిరింపు కాల్‌ 

 బెయిల్‌పై బయటికొచ్చిన ఓ యువకుడు తిరిగి జైలుకు వెళ్లేందుకు ఓ పథకం వేశాడు. పోలీసులకు ఫోన్‌ చేసి తను ప్రధాని మోదీని చంపేస్తానని బెదిరించాడు.

Published : 05 Jun 2021 01:19 IST


దిల్లీ: బెయిల్‌పై బయటికొచ్చిన ఓ యువకుడు తిరిగి జైలుకు వెళ్లేందుకు ఓ పథకం వేశాడు. పోలీసులకు ఫోన్‌ చేసి తను ప్రధాని మోదీని చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన దిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలోని ఖజూరి ఖాస్‌ ప్రాంతానికి చెందిన సల్మాన్‌(22) పలు కేసుల్లో అరెస్టై జైలుకెళ్లాడు. ఇటీవలే బెయిల్‌పై బయటికొచ్చాడు. గురువారం రాత్రి పోలీసులకు ఫోన్ చేసి ‘ప్రధాని మోదీని చంపేస్తా’ అని బెదిరించాడు. అప్రమత్తమైన పోలీసులు లొకేషన్‌ ఆధారంగా నిందితుడు సల్మాన్‌ని అరెస్టు చేశారు. మళ్లీ జైలుకు వెళ్లేందుకే ఇలా చేశానని సల్మాన్‌ విచారణలో పేర్కొనడం గమనార్హం. అయినా, ప్రధాని మోదీపై బెదిరింపు కాల్‌ రావడంతో నిఘావర్గాలు కూడా సల్మాన్‌ను ప్రశ్నించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని