Karimganj: నదిపై వేలాడే వంతెన కూలి 30మంది విద్యార్థులకు గాయాలు!

నదిపై వేలాడే వంతెన కూలిపోవడంతో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. రాటాబరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరాగి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.......

Published : 06 Oct 2021 01:24 IST

గువాహటి: అసోంలోని కరీంగంజ్‌ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. నదిపై వేలాడే వంతెన కూలిపోవడంతో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. రాటాబరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరాగి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చెరాగి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే సింగ్లా నదిపై ఉన్న ఈ వేలాడుతున్న వంతెనను దాటాల్సి ఉంటుంది. ఈ నది చెరాగి ప్రాంతాన్ని అక్కడి గ్రామంతో కలుపుతుంది. అయితే, కొన్నేళ్లుగా విద్యార్థులు, ప్రజలు పాఠశాలలకు.. ఇతర ప్రాంతాలకు ఇదే వంతెన నుంచి వెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం చెరాగి విద్యాపీఠ్‌ హైస్కూల్‌ విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు సింగ్లా నదిని దాటేందుకు ప్రయత్నించగా.. అది అకస్మాత్తుగా కూలిపోవడంతో అనేకమంది విద్యార్థులు నదిలో పడిపోయినట్టు సమాచారం. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని విద్యార్థులను కాపాడారు. ఈ ఘటనలో దాదాపు 30మంది విద్యార్థులు గాయపడగా.. వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ వేలాడే వంతెనను మూడేళ్ల క్రితమే నిర్మించినట్టు గ్రామస్థులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని