Crime news: భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్.. ముక్కూ చెవులు కోసేసిన భర్త!
అక్రమసంబంధం పెట్టుకోవాలని తన భార్యను బలవంతం చేస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తి ఓ పోలీసు ముక్కు, చెవులు, పెదాలు కోసేశాడు.........
లాహోర్: అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ తన భార్యను బలవంతం చేస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తి ఓ పోలీస్ ముక్కు, చెవులను కోసేశాడు. అంతకుముందు అతడిపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో వెలుగులోకి వచ్చింది. ఝండ్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఇఫ్తికార్ తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అయితే అతడు ఇంట్లో లేని సమయంలో కానిస్టేబుల్ ఖాసిమ్ హయత్ ఇంట్లోకి చొరబడి తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తున్నాడని ఇఫ్తికార్ ఆరోపించాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోలేదన్నాడు.
ఈ నేపథ్యంలోనే డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళుతున్న కానిస్టేబుల్ను ఓ ప్రాంతంలో అడ్డుకున్న ఇఫ్తికార్.. అతడిని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. తీవ్రంగా దాడి చేసి.. కత్తితో అతడి ముక్కు, చెవులు తదితర అవయవాలను కోసేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Hyderabad: ప్రణీత్రావుకు సహకరించింది ఎవరు?
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. -
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతున్న ఓ యువతిని నల్గొండ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
బెంగళూరులో పేలుడు పదార్థాలు వెలుగు చూసిన ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
శంషాబాద్ పరిధిలో నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. -
వైకాపా మూకల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త మృతి
వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన తెదేపా కార్యకర్త మునయ్య మృతిచెందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్లో సోమవారం ఆయనపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. -
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
వంట చేయడంలో ఆలస్యం అయిందని ఓ వ్యక్తి భార్యను పదునైన ఆయుధంతో చంపేశాడు. అనంతరం భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అధిక వడ్డీల ఆశజూపి.. భారీ మోసం!
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటుచేసుకుంది. -
కోల్కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
హార్డ్డిస్కులను అడవిలో పడేసిన ప్రణీత్రావు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి కారు, ట్రాక్టర్ ఢీ.. బిహార్లో 9 మంది మృతి
బిహార్లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, పెళ్లి కారు ఢీ కొన్న ఘటనలో 9 మంది మరణించారు. -
నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ దాడులు
దేశ రాజధాని దిల్లీలో బయటపడిన నకిలీ ఔషధ రాకెట్ గుట్టును ఛేదించే క్రమంలో ఈడీ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది. ముఠా ప్రధాన సూత్రధారులు విపిల్ జైన్, నీరజ్ చౌహన్, సూరజ్ షాత్, అభినవ్, తుషార్ చౌహాన్లతో సహా వారి సహచరుల ఇళ్లల్లోను ఈడీ దాడులు చేసింది. -
రూ.5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈదులగూడ వద్ద సోమవారం పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్తున్న టీఎస్ 09 యూఈ 2479 నంబరు గల బొలేరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్ద చోరీ.. ఆపై అడ్డంగా దొరికారు
ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేసిన ఇద్దరు దొంగలు చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాల పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
Pawan Kalyan: కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన
-
Zomato: జొమాటో కొత్త సేవలు.. వెజిటేరియన్స్కు ఇక ప్రత్యేకంగా
-
Paris Olympics: ఒలింపిక్ విలేజ్లో 3లక్షల కండోమ్లు..!
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన