Hyderabad: బామ్మర్ది ఎంత పనిచేశావ్.. డబ్బు కోసం ఇంత బరితెగింపా?
నమ్మకంగా ఉండాల్సిన కుటుంబ సభ్యులే డబ్బుకోసం బరితెగించడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఏసీపీ మోహన్ కుమార్ వెల్లడించారు.
పంజాగుట్ట (హైదరాబాద్): భాగ్యనగరం (Hyderabad)లో కలకలం సృష్టించిన ఓ వ్యక్తి కిడ్నాప్ (kidnap) కేసును పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బాధితుడి బామ్మర్దే సూత్రధారి అని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. నమ్మకంగా ఉండాల్సిన కుటుంబ సభ్యులే డబ్బుకోసం బరితెగించడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఏసీపీ మోహన్ కుమార్ వెల్లడించారు.
ఓవర్సీస్ జాబ్ కన్సల్టెంట్గా పని చేస్తున్న అమీర్పేట్కు చెందిన మురళీ కృష్ణ.. గత నెల 27న అమీర్పేట్ లాల్ బంగ్లా సమీపంలోని నీరజ్ పబ్లిక్ స్కూల్లో పిల్లల్ని వదిలి వస్తుండగా ఇన్నోవా కారులో వచ్చిన ఐదుగురు అడ్డుకున్నారు. ఆదాయపన్ను అధికారులమని చెబుతూ మురళీకృష్ణను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అనంతరం నగర శివారులోని బాటసింగారంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. రూ.60 లక్షలు ఆదాయపు పన్ను చెల్లించాలన్నారు. అందుకు మురళీకృష్ణ అంగీకరించకపోవడంతో చేయి చేసుకున్నారు. అతడి బావమరిదిని అరెస్టు చేశామని చెప్పి.. అతనితో ఫోన్లో మాట్లాడించారు. చివరికి భార్యను కూడా అరెస్టు చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన మురళీ కృష్ణ.. తన భార్యకు జరిగింది చెప్పి.. రూ.30 లక్షలు సిద్ధం చేయించాడు. బావమరిదికి డబ్బులు ఇచ్చి.. నాంపల్లి వద్దకు నిందితుల్ని రప్పించారు. అక్కడ బ్యాగ్ తీసుకున్న తర్వాత.. నిందితులు మురళీకృష్ణను ఔటర్ రింగురోడ్డు వద్ద వదిలేశారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న బాధితుడు ఈనెల 4న పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మొబైల్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి కేసును ఛేదించారు.
బాధితుడు మురళీకృష్ణ బావమరిది రాజేశ్.. ఈ కిడ్నాప్నకు ప్రధాన సూత్రధారి అని ఏసీపీ మోహన్ కుమార్ తెలిపారు. రాజేశ్ తనకు వరసకు సోదరుడైన విజయవాడకు చెందిన డి.రాఘవేంద్ర, అతనితోపాటు జీవన్ కుమార్, అబ్దుల్ సలీమ్, పలపు లక్ష్మయ్య, ఎ.కృష్ణ గోపాల్ (కిట్టు), శ్రీనివాస్(వాసు) తదితరులను గ్రూప్గా చేసుకొని ఈ కిడ్నాప్నకు పాల్పడ్డారు. అనంతరం మురళీకృష్ణ భార్య లావణ్యతో ఫోన్లో మాట్లాడి రూ.60లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె రూ.30లక్షలే ఉన్నాయని తన సోదరుడు రాజేశ్కు ఇచ్చి పంపింది. ఈ రూ.30లక్షలు అందిన తర్వాత మురళీకృష్ణను ఔటర్ రింగురోడ్డు వద్ద వదిలిపెట్టారు. రాజేశ్తో పాటు ఏడుగురిని నిందితులుగా గుర్తించారు. ఆరుగురిని అరెస్టు చేయగా గౌస్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. కిడ్నాప్నకు ఉపయోగించిన ఇన్నోవాతో పాటు రూ.15.45లక్షల నగదు, ద్విచక్రవాహనం, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్