srisailam: డ్రోన్ సంచారంపై ముమ్మర విచారణ
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో డ్రోన్ సంచారంపై విచారణ ముమ్మరం చేసినట్లు కర్నూలు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన...
శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో డ్రోన్ సంచారంపై విచారణ ముమ్మరం చేసినట్లు కర్నూలు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మాత్రమే డ్రోన్ తిరిగినట్లు ఎస్పీ పేర్కొన్నారు. డ్రోన్ ఎగిరిన ఘటనలో నలుగురిని పిలిపించి ప్రశ్నించినట్లు తెలిపారు. శ్రీశైలం పోలీసు స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తులపై ఐపీసీ 287, 263 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఏం జరిగిందంటే..
శ్రీశైలంలో మూడు రోజులుగా రాత్రి వేళ డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు సమాచారం. అయితే శనివారం రాత్రి క్షేత్రంలోని పురువీధుల్లో డ్రోన్ చక్కర్లు కొడుతుండగా స్థానికులు గుర్తించి దేవస్థానం భద్రతా సిబ్బందికి తెలియజేశారు. వారు దాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేశారు. అటవీశాఖ సిబ్బంది నైట్ విజన్ కెమెరాలతో వీక్షంచారు. అయితే దాన్ని ఆపరేట్ చేసిందెవరో గుర్తించలేకపోయారు. దీనిపై దేవస్థానం ఈవో కేఎస్ రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్