కారు డ్రైవర్ను రోడ్డుపైనే చితక్కొట్టిన పోలీసులు
ఫ్రెండ్లీ పోలీసింగ్.. తరచూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు తరచూ చెప్పే మాటలివి. ఎక్కడ ఏం జరిగినా ధైర్యంగా
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేసిన ఎస్పీ
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రెండ్లీ పోలీసింగ్.. తరచూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు తరచూ చెప్పే మాటలివి. ఎక్కడ ఏం జరిగినా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించవచ్చు.. సమస్య ఏదైనా ఎలాంటి ఆలోచన, బెరుకు లేకుండా పోలీసులను సంప్రదించవచ్చని చెబుతుంటారు. అయితే అచరణలో మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పూర్తిగా జరుగుతుందా? పోలీసులు నిజంగానే సామాన్య ప్రజలతో అంత ఫ్రెండ్లీగా ఉంటున్నారా? అంటే.. చెప్పలేని పరిస్థితి. తాజాగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఓ డ్రైవర్ పట్ల కొంత మంది పోలీసులు ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసులుగా పేరున్న శాఖకు కొంతమంది తీరు తలవంపులు తెస్తోంది. సంగారెడ్డి జిల్లాలో పోలీసులు ఓ డ్రైవర్పై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై బూటు కాలితో తన్నడంతో పాటు లాఠీలతో విచక్షణ లేకుండా చితకబాదారు.
సంగారెడ్డిలోని సదాశివపేటలో పోలీసులు సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా కారు డ్రైవర్ వాజిద్ను ఆపి తనిఖీ చేసి వెళ్లిపోమని చెప్పారు. అంతలోనే పోలీసులు మరోసారి అనుమానం వచ్చి కారును ఆపాలని కోరారు. ఈ గందరగోళంలో డ్రైవర్కు విషయం అర్థం కాకపోవడం వల్ల వాహనాన్ని ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశాడు. అది గమనించిన పోలీసులు ఆగకుండా వెళ్తావా? అంటూ డ్రైవర్ను కారు నుంచి బయటకు లాగిపడేసి కొట్టారు. విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. కింద పడేసి ఓ కానిస్టేబుల్ కాలితో తన్నుతుండగా హోంగార్డు లాఠీతో చితక్కొడుతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ వాజిద్ తీవ్రంగా గాయపడ్డాడు. నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయి సిబ్బంది పెడచెవిన పెడుతున్నారనే దానికి ఈ ఘటన నిదర్శనమని.. సదాశివపేట పోలీసుల తీరుపై ప్రజలు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.
సమర్థించుకునే ప్రయత్నం చేసిన డీఎస్పీ..
డ్రైవర్ వాజిద్పై దాడి ఘటనను డీఎస్పీ బాలాజీ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తనిఖీలు నిర్వహిస్తుండగా వాజిద్ వాహనం ఆపామని.. ఈ క్రమంలో కానిస్టేబుల్కు వాహనాన్ని తగిలించాడని డీఎస్పీ చెప్పారు. పోలీసులకు వాహనం తగలడంతో స్థానికులే కొట్టారని చెప్పుకొచ్చారు. డ్రైవర్, కానిస్టేబుళ్ల మధ్య తోపులాట జరిగిందన్నారు. నిన్న జరిగిన ఘటనను వెంటనే పరిష్కరించామని వెల్లడించారు. అయితే పోలీసులు డ్రైవర్ను తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు వైరల్ అవుతుండగా డీఎస్పీ ఘటనను సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
కానిస్టేబుల్, హోంగార్డు సస్పెన్షన్
డ్రైవర్ను చితకబాదిన ఘటనపై జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి స్పందించారు. విచక్షణారహితంగా ప్రవర్తించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామన్నారు. కానిస్టేబుల్ రాములు, హోంగార్డు బాలరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్సై దుర్గయ్య, మరో కానిస్టేబుల్ ప్రసాద్ను హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
మహారాష్ట్రలోని కల్యాణ్లో ఓ రైలు ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు మరో కేసులోని డెత్ మిస్టరీని ఛేదించారు. -
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి