Hyderabad: తల నరికి.. మొండేన్ని ముక్కలు చేసిన కేసులో దర్యాప్తు సాగిందిలా..
అప్పు తీర్చాలని అడిగినందుకు తల నరికి.. మొండేన్ని ముక్కలు చేసి మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
సైదాబాద్: అప్పు తీర్చాలని అడిగినందుకు నర్సు తల నరికి.. మొండేన్ని ముక్కలు చేసి దారుణంగా హతమార్చిన ఘటన నగరంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాను సహజీవనం చేస్తున్న మహిళ వద్ద అతడు అప్పు తీసుకొని.. ఆ సొమ్ము తిరిగి ఇమ్మని అడిగినందుకు ఆమెను నిందితుడు చంద్రమోహన్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దాదాపు వారం రోజులు దర్యాప్తు చేసి ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. తాజాగా ఈ కేసును ఛేదించే క్రమంలో దర్యాప్తు సాగిన తీరును పోలీసు వర్గాలు వెల్లడించాయి.
‘‘అనురాధ హత్యకేసు ఛేదించేందుకు పోలీసులు ఎంతో శ్రమించారు. మృతురాలి తల పడేసిన స్థలం పరిసరాల్లో ఉన్న వందల సీసీ కెమెరాలను మలక్పేట పోలీసులు పరిశీలించారు. ముఖానికి మాస్క్ పెట్టుకుని ఓ ఆటోలో వెళ్తున్న వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ దిశగా దర్యాప్తును చేశారు. నిందితుడి ఆనవాళ్లు కూడా లేకపోవడంతో పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేశారు. ఈ నెల 15, 16వ తేదీల్లో దాదాపు 100 అనుమానాస్పద వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని.. ఎట్టకేలకు నిందితుడు ఉపయోగించిన ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ చెప్పిన చిరునామా ఆధారంగా నిందితుడి ఇంటిని గుర్తించారు. హత్య చేసిన తర్వాత మృతురాలి తల పడేయడానికి బయటకొచ్చిన సమయంలో నిందితుడు చంద్రమోహన్ మాస్క్ పెట్టుకున్నట్టు పోలీసులు తేల్చారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడటంతో హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది’’ అని పోలీసు వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు