Hyderabad: బర్త్‌డే పార్టీలో గంజాయి కలకలం.. పోలీసుల అదుపులో 33 మంది

హైదరాబాద్‌ శివారులోని హయత్‌నగర్‌ మండలం పసుమాముల వద్ద ఓ ఫామ్‌హౌస్‌పై పోలీసుల దాడి చేశారు. పుట్టినరోజు వేడుకల్లో గంజాయి వాడినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకొని పార్టీని భగ్నం చేశారు.

Updated : 03 Dec 2022 22:10 IST

హయత్‌నగర్‌: హైదరాబాద్‌ శివారులోని హయత్‌నగర్‌ మండలం పసుమాముల వద్ద ఓ ఫామ్‌హౌస్‌పై పోలీసుల దాడి చేశారు. పుట్టినరోజు వేడుకల్లో గంజాయి వాడినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకొని పార్టీని భగ్నం చేశారు. బర్త్‌డే పార్టీలో పాల్గొన్న 29 మంది యువకులు, నలుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరంతా నగరంలోని రెండు ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థుల నుంచి 11కార్లు, బైక్‌, 28 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని