Kothagudem: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. బాధితుల్లో 15 మంది మైనర్‌ బాలికలు?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పలు పోలీసుస్టేషన్ల పరిధిలో కొనసాగుతున్న వ్యభిచార గృహాలపై సోమవారం పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. 

Published : 30 Jan 2023 10:19 IST

కొత్తగూడెం టౌన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పలు పోలీసుస్టేషన్ల పరిధిలో కొనసాగుతున్న వ్యభిచార గృహాలపై సోమవారం పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. మైనర్‌ బాలికలే లక్ష్యంగా వ్యభిచార కూపంలోకి లాగుతున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహాల్లో 15 మంది మైనర్‌ బాలికలు ఉన్నట్లు సమాచారం. 

ప్రత్యేకంగా వ్యభిచార గృహాలు ఏర్పాటు చేసి బాలికలు, యువతులను అక్కడికి తీసుకెళ్తున్న కొంతమంది నిర్వాహకులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఓ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇంకా ఎక్కడెక్కడ వ్యభిచార కేంద్రాలు కొనసాగుతున్నాయన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం మధ్యాహ్నం పోలీసు అధికారులు వెల్లడించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు