Telangana News: పటాన్‌చెరు సమీపంలో కోడిపందేలు .. పరారీలో పలువురు

పటాన్‌చెరు మండలం చినకంజర్లలో కోడి పందేలు నిర్వహిస్తున్న పలువురు పోలీసులకు చిక్కారు. సమాచారం అందుకున్న పోలీసుల స్థావరంపై  దాడి చేసి 21 మందిని అరెస్టు చేశారు.

Updated : 07 Jul 2022 06:51 IST

సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం చినకంజర్లలో కోడి పందేలు నిర్వహిస్తున్న పలువురు పోలీసులకు చిక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందేలు నిర్వహిస్తున్న స్థావరంపై  దాడి చేసి 21 మందిని అరెస్టు చేశారు. రూ.13.12 లక్షలు, 26 వాహనాలు, 27 చరవాణులు, 31 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 70 మంది కోడిపందేల్లో పాల్గొన్నారని పటాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి తెలిపారు. చింతమనేని ప్రభాకర్‌ నేతృత్వంలో ఈ పందేలు సాగుతున్నాయని డీఎస్పీ వెల్లడించారు. అక్కినేని సతీష్‌, కృష్ణంరాజు, బర్ల రాజుతో నిర్వాహకులని తెలిపారు. ఈ ఘటనలో చింతమనేని ప్రభాకర్‌తో పాటు చాలామంది పరారయ్యారని డీఎస్పీ పేర్కొన్నారు. అక్కినేని సతీష్‌, బర్ల రాజును  పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్నవారిని పట్టుకునేందుకు మూడు బృందాలను నియమించామని డీఎస్పీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని