వైఎస్ ప్రతాప్రెడ్డి కార్యాలయంలో సోదాలు
కడప జిల్లా మామిళ్లపల్లిలోని ముగ్గురాయి గనుల్లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనలో అరెస్టయిన వైఎస్ ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో
పులివెందుల: కడప జిల్లా మామిళ్లపల్లిలోని ముగ్గురాయి గనుల్లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనలో అరెస్టయిన వైఎస్ ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. పులివెందులలోని ఆయన కార్యాలయంలో పోరుమామిళ్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందిని విచారించారు. పేలుడు పదార్థాలు ఎలా నిల్వచేస్తారు? ఎక్కడ నుంచి తెస్తారు? ఎవరికి విక్రయిస్తారు? ఇటీవల ఎవరెవరికి విక్రయించారు? తదితర వివరాలపై ఆరా తీశారు. మామిళ్లపల్లి క్వారీలో ఈ నెల 8న జరిగిన పేలుడు ఘటనలో 10మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 11న వైఎస్ ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్