భార్గవరామ్.. గుంటూరు శ్రీను ఎక్కడ?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవీణ్రావు సోదరుల కిడ్నాప్ కేసులో పోలీసుల పట్టు క్రమంగా సడలుతోంది. నిందితులందరినీ నాలుగైదు రోజుల్లో అరెస్టు చేస్తామంటూ పోలీస్ ఉన్నతాధికారులు..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవీణ్రావు సోదరుల కిడ్నాప్ కేసులో పోలీసుల పట్టు క్రమంగా సడలుతోంది. నిందితులందరినీ నాలుగైదు రోజుల్లో అరెస్టు చేస్తామంటూ పోలీస్ ఉన్నతాధికారులు నాడు ప్రకటించారు. ఈ కేసులో ప్రథమ ముద్దాయి మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె ఆదేశాలను పాటించిన వారిని మినహా సూత్రధారులు భార్గవరామ్, గుంటూరు శ్రీను, పాత్రధారులైన భార్గవరామ్ తల్లి కిరణ్మయి, భూమా అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలను పోలీసులు పట్టుకోలేదు. భార్గవ రామ్, శ్రీనులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్న ఉన్నతాధికారులు.. నెల రోజులు దాటినా వారి ఆచూకీని గుర్తించలేకపోయారు. వీరిద్దరితో పాటు పారిపోయిన నిందితులు సైతం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి సురక్షితంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం.
బృందాల మధ్య విభేదాలు!
అఖిలప్రియ భర్త భార్గవరామ్, గుంటూరు శ్రీనులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల్లోని సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని తెలిసింది. ప్రవీణ్రావు సోదరుల అపహరణ అనంతరం నిందితులను పట్టుకున్నప్పుడు తామే అంతా చేశామంటూ రెండు ప్రత్యేక బృందాల్లో సభ్యులు ఉన్నతాధికారులకు చెప్పుకొని అభినందనలు అందుకున్నారు. అఖిల ప్రియ ఆచూకీతో సహా ఆమె అనుచరులు ఎక్కడున్నారన్న విషయాన్ని తెలుసుకుని పట్టుకున్నామని, పేరు మాత్రం వేరే బృందాల వారికి వచ్చిందని మరో బృందం సభ్యులు భావించారు. దీంతో అప్పటి నుంచి ఇతర నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలు సమాచారం సేకరిస్తున్నా...పరస్పరం సహకరించుకోవడం లేదని విశ్వసనీయంగా తెలిసింది.
‘సరి’ చేసుకున్నారా?
ఈ కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న కొందరు వ్యక్తులు తమను అరెస్టు చేయకుండా సమీకరణాలను ‘సరి’ చేసుకున్నట్టు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారమైనా ఇస్తాం..దర్యాప్తు ప్రక్రియలో సహకరిస్తాం అంటూ పోలీసులకు చెప్పిన ఆ వ్యక్తులు అఖిల ప్రియ అరెస్టు అనంతరం జరిగిన పరిణామాలను పరిశీలించి జైలుకు వెళ్లడం శ్రేయస్కరం కాదని అనుకున్నట్టు సమాచారం. దీంతో పక్క రాష్ట్రంలోని పోలీసులతో సంబంధాలున్న వారు.. హైదరాబాద్లో ప్రభావం చూపించే వారితో ‘మాట్లాడుకున్నట్టు’ తెలిసింది. మరికొందరు నిందితుల గురించి తామే సమాచారం చెబుతామని ఇందుకు ప్రతిగా పోలీస్ విభాగం తమకు సహకరించాలంటూ వారు అభ్యర్థించినట్టు సమాచారం. దీంతో సదరు వ్యక్తులు పోలీసు ‘గురి’ నుంచి తప్పించుకున్నారని తెలిసింది.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.