స్నేహితులకు దావత్ ఇచ్చేందుకు.. దారి దోపిడీకి పాల్పడ్డ కానిస్టేబుల్‌!

స్నేహితులకు దావత్ ఇచ్చేందుకు ఓ కానిస్టేబుల్.. దొంగగా మారిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.

Updated : 20 Feb 2022 10:39 IST

హైదరాబాద్‌: స్నేహితులకు దావత్ ఇచ్చేందుకు ఓ కానిస్టేబుల్.. దొంగగా మారిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. మిత్రుల విలాసాల కోసం డబ్బు లేకపోవడంతో.. దారి దోపిడీకి పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. రాజస్థాన్‌కు చెందిన అనూప్ సింగ్.. నగరంలో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తన ప్రాంతానికి చెందిన ఇద్దరు స్నేహితులకు అతడు ఆశ్రయమిచ్చాడు. వారి విలాసాలకు డబ్బులు సరిపోక.. సికింద్రాబాద్ ఖార్ఖానా పరిధిలోని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిపై దారి దోపిడీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని