విద్యార్థులను తరిమేసి..బాలికపై అత్యాచారం..కీచకుడిగా మారిన ప్రిన్సిపల్
బిహార్లోని కైమూర్ జిల్లాలో ఓ పాఠశాల ప్రిన్సిపల్ దారుణానికి ఒడిగట్టాడు. అదే స్కూల్లో చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
పట్నా: విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాల ప్రిన్సిపల్ కీచకుడిగా మారాడు. వయస్సు మరిచిపోయి మృగంలా ప్రవర్తించాడు. కన్న కూతురిలా చూసుకోవాల్సిన విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తోటి విద్యార్థులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగా చూసి.. వారిని తరిమేసి తన కోరిక తీర్చుకున్నాడు. సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటన బిహార్లోని కైమూర్లో జరిగింది.
కైమూర్ ఎస్పీ రాకేశ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పిప్రా గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. అదే తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు పాఠశాల సమీపంలోని పొలాల్లోకి శనివారం సాయంత్రం ఆమెను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను ఎత్తుకెళ్తున్న విషయాన్ని గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్ సురేంద్ర భాస్కర్ వారిని దూరం నుంచి అనుసరించాడు. కొద్దిసేపయిన తర్వాత బాలిక గట్టిగా కేకలు వేయడంతో ప్రిన్సిపాల్ వాళ్ల దగ్గరికి వెళ్లాడు. అతడిని చూసిన విద్యార్థులంతా అక్కడి నుంచి పారిపోయారు. తొలుత ధైర్యం చెప్పిన ప్రిన్సిపల్.. ఆమెను రక్షిస్తున్నట్లుగా నటించి..తన కోరిక తీర్చుకున్నాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత బాలిక గాయాలతో ఇంటికి చేరి, జరిగిన విషయాన్ని ఆమె తల్లికి చెప్పింది. అనంతరం బాధితురాలని కుటుంబ సభ్యులు భాబువా మహిళా పోలీస్టేషన్కు తీసుకెళ్లారు. నలుగురు విద్యార్థులతోపాటు పాఠశాల ప్రిన్సిపల్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రిన్సిపల్ను ఆదివారమే అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు చెప్పారు. చికిత్స కోసం బాధిత బాలికను ఆస్పత్రికి తరలించామని, ఆమె కోలుకున్న తర్వాత వాంగ్మూలాన్ని నమోదు చేసి నిందితులను కోర్టు ఎదుట ప్రవేశపెడతామన్నారు. నిందిత విద్యార్థులు కూడా పోలీస్ కస్టడీలోనే ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.