విద్యార్థులను తరిమేసి..బాలికపై అత్యాచారం..కీచకుడిగా మారిన ప్రిన్సిపల్
బిహార్లోని కైమూర్ జిల్లాలో ఓ పాఠశాల ప్రిన్సిపల్ దారుణానికి ఒడిగట్టాడు. అదే స్కూల్లో చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
పట్నా: విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాల ప్రిన్సిపల్ కీచకుడిగా మారాడు. వయస్సు మరిచిపోయి మృగంలా ప్రవర్తించాడు. కన్న కూతురిలా చూసుకోవాల్సిన విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తోటి విద్యార్థులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగా చూసి.. వారిని తరిమేసి తన కోరిక తీర్చుకున్నాడు. సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటన బిహార్లోని కైమూర్లో జరిగింది.
కైమూర్ ఎస్పీ రాకేశ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పిప్రా గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. అదే తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు పాఠశాల సమీపంలోని పొలాల్లోకి శనివారం సాయంత్రం ఆమెను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను ఎత్తుకెళ్తున్న విషయాన్ని గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్ సురేంద్ర భాస్కర్ వారిని దూరం నుంచి అనుసరించాడు. కొద్దిసేపయిన తర్వాత బాలిక గట్టిగా కేకలు వేయడంతో ప్రిన్సిపాల్ వాళ్ల దగ్గరికి వెళ్లాడు. అతడిని చూసిన విద్యార్థులంతా అక్కడి నుంచి పారిపోయారు. తొలుత ధైర్యం చెప్పిన ప్రిన్సిపల్.. ఆమెను రక్షిస్తున్నట్లుగా నటించి..తన కోరిక తీర్చుకున్నాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత బాలిక గాయాలతో ఇంటికి చేరి, జరిగిన విషయాన్ని ఆమె తల్లికి చెప్పింది. అనంతరం బాధితురాలని కుటుంబ సభ్యులు భాబువా మహిళా పోలీస్టేషన్కు తీసుకెళ్లారు. నలుగురు విద్యార్థులతోపాటు పాఠశాల ప్రిన్సిపల్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రిన్సిపల్ను ఆదివారమే అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు చెప్పారు. చికిత్స కోసం బాధిత బాలికను ఆస్పత్రికి తరలించామని, ఆమె కోలుకున్న తర్వాత వాంగ్మూలాన్ని నమోదు చేసి నిందితులను కోర్టు ఎదుట ప్రవేశపెడతామన్నారు. నిందిత విద్యార్థులు కూడా పోలీస్ కస్టడీలోనే ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
building collapse: కోల్కతాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
building collapse: కోల్కతాలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో పది మందిని సహాయ సిబ్బంది రక్షించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలో సీఐ కుమారుడి ‘సెల్’చల్
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీయింగ్కు యత్నిస్తూ ఓ అభ్యర్థి చిక్కాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా బేస్తవారపేటకు చెందిన తేళ్ల చిన మల్లయ్య పల్నాడు జిల్లా కారంపూడి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. -
ఇన్స్టాగ్రామ్లో ప్రకటన.. రూ.40 లక్షలు నష్టపోయిన వ్యాపారి
ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రకటనను నమ్మిన ఓ వ్యాపారి రూ.40.67 లక్షల మేర మోసపోయారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. -
చెవి దుద్దులు కొనివ్వలేదని.. భర్తకు నిప్పంటించిన భార్య!
చెవి దుద్దులు కొనివ్వడం లేదని భర్తకు భార్య నిప్పంటించిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమెపై ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
ఎంపీ కారును ఢీకొని విద్యార్థి దుర్మరణం
తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని దామినేడు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందారు. -
లారీని ఢీకొని ముగ్గురు కూలీలు దుర్మరణం
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. -
తేనెటీగల దాడిలో రైతు మృతి
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన రైతు పుండ్రు నారాయణరెడ్డి(80) తేనెటీగల దాడిలో మృతిచెందారు. -
పీఎంసీ బ్యాంకును మోసగించిన కేసులో ఆస్తుల జప్తు
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ను మోసగించిన కేసులో హైదరాబాద్ సుల్తాన్బజార్ కింగ్కోఠి రోడ్డులోని హోటల్ వన్కాంటినెంట్కు చెందిన 2-5 అంతస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసింది. -
ఎస్ఐబీలో ఆధారాలను ధ్వంసం చేయాల్సిన అవసరమేంటి?
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో ఆధారాలను ధ్వంసం చేయాల్సిన అవసరమేంటని ఆ విభాగంలో డీఎస్పీగా పనిచేసిన దుగ్యాల ప్రణీత్రావును హైదరాబాద్ పోలీసులు ప్రశ్నించారు. అందుకు ఎవరైనా ఆదేశించారా అని ఆరా తీశారు. -
అంజిలప్ప ఇంట్లో అనిశా సోదాలు
గొర్రెల సరఫరా నిధుల మళ్లింపు కేసులో అనిశా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు అంజిలప్ప ఇంటితో పాటు ఇతర ప్రాంతాల్లో రెండు రోజులపాటు సోదాలు నిర్వహించిన అనిశా అధికారులు రూ.9 లక్షల నగదు, అరకిలో బంగారం, బ్యాంక్ లాకర్లలో పలు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. -
Sangareddy: చేపల కాపలాకు కారులో వస్తే.. దృష్టి మరల్చి ఎత్తుకెళ్లారు!
చెరువులో చేపల కాపలాకు వచ్చిన వ్యక్తిని దృష్టి మరల్చి.. గుర్తుతెలియని దుండగుడు ఆయన కారును ఎత్తుకెళ్లాడు.
తాజా వార్తలు (Latest News)
-
NDA: బిహార్లో ‘ఎన్డీయే’ సీట్ల పంపకం పూర్తి.. అధిక స్థానాల్లో భాజపా పోటీ
-
PM Modi: ‘మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’.. పుతిన్కు ప్రధాని మోదీ విషెస్
-
MNP: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కొత్త రూల్.. జులై 1 నుంచి అమల్లోకి
-
Chennai Super Kings: అన్నాడీఎంకేకు 80% విరాళాలు.. సీఎస్కే యాజమాన్యం నుంచే
-
RS Praveen Kumar: భారాసలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
MLC Kavitha: ఆప్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు.. ఈడీ ప్రకటన