Crime News: స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి హత్యను ఛేదించిన పోలీసులు
గోపాలపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి మృతి కేసును పోలీసులు ఛేదించారు. రాజేశ్ అనే వ్యక్తి అంజిరెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సికింద్రాబాద్: గోపాలపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి మృతి కేసును పోలీసులు ఛేదించారు. అంజిరెడ్డిని రాజేష్ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంజిరెడ్డి ఆస్తులను కాజేసేందుకే నిందితుడు పక్కా ప్రణాళిక ప్రకారం కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇద్దరు బిహారీ వ్యక్తులతో కలిసి అంజిరెడ్డిని రాజేష్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం రహదారి ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 29వ తేదీన గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి మృతిచెంది కనిపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా నిందితుడు రాజేష్ను అదుపులోకి తీసుకొని పోలీసులు పశ్నించారు. దీంతో ఈ కుట్రకోణం బట్టబయలైంది. అంజిరెడ్డి తన ఆస్తులను అమ్మి అమెరికాకు వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో ఆస్తులను అమ్మే పనిని రాజేష్కి అప్పజెప్పాడు. ఇదే అదునుగా భావించిన రాజేష్ ఎలాగైనా ఆస్తులను తన సొంతం చేసుకోవాలని ఉద్దేశంతో తన పేరిట ఆస్తులను రాయించుకుని అంజిరెడ్డి హత్యకు కుట్ర పన్నాడు. పథకం ప్రకారం ఇద్దరు బిహారీ వ్యక్తులకు సుపారీ ఇచ్చి అంజిరెడ్డిని ఓ వాణిజ్య సముదాయం సెల్లార్లో హత్య చేశాడు. అనంతరం గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహాన్ని పడవేశారు. పోలీసులకు, కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు రహదారి ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నకూతుళ్లను కీచకులకు అప్పగించిన తల్లికి.. 40 ఏళ్ల జైలు శిక్ష..!
Crime News: మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి కన్న కుమార్తెలను ఘోరమైన మనో వేదనకు గురిచేసింది. ఆమె చర్యలను తీవ్రంగా ఖండించిన కోర్టు.. 40 ఏళ్ల జైలు శిక్షను విధించింది. -
వృత్తలేఖినితో 108 సార్లు పొడిచారు
మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. చిన్న ఘర్షణ కారణంగా నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై తోటి విద్యార్థులు వృత్తలేఖిని(జామెట్రీ కంపాస్)తో 108 సార్లు పొడిచారు. -
ఎలుగుబంటి దాడిలో విశాఖ జూ ఉద్యోగి మృతి
విశాఖ జంతు ప్రదర్శనశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎలుగుబంటి దాడిలో దాన్ని సంరక్షించే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. -
ఆటో, ఇసుక లారీ ఢీ.. తండ్రీ కుమారుల దుర్మరణం
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం రంగపేటస్జేజీ వద్ద సోమవారం రాత్రి ఆటోను ఇసుక లారీ ఢీకొనడంతో తండ్రీకుమారులు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఏపీలో.. బాలికల వసతిగృహంలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమందలోని నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల (ఎన్ఈసీ)లో బీటెక్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థిని కోలగట్ల రేచల్రెడ్డి (19) ఆత్మహత్యకు పాల్పడింది. -
యూపీలో యువకుడిపై మూత్రం.. నలుగురి అరెస్టు
ఉత్తర్ ప్రదేశ్లోని మేరఠ్లో ఒక యువకుడిని తీవ్రంగా కొట్టి మూత్రం పోసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా ముగ్గురు నిందితులను అరెస్టు చేయాల్సి ఉంది.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand Tunnel: డ్రిల్లింగ్ పూర్తి.. ఏ క్షణమైనా కూలీలు బయటకు..
-
Supreme court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
-
Automobile retail sales: పండగ సీజన్లో రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. 19% వృద్ధి
-
ఐపీఎల్ వాళ్లకు చేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అచ్చిరాని ఇండియన్ లీగ్
-
North Korea: కిమ్ శాటిలైట్.. శ్వేతసౌధం, పెంటాగన్ ఫొటోలు తీసిందట..!
-
Atchannaidu: వచ్చేది తెదేపా ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు