Crime News: శారీరక వాంఛ.. ఆడవాళ్లను చంపడమే అతడి లక్ష్యం!
పెందుర్తిలో వరుస హత్యల కేసు మిస్టరీ వీడింది. పోలీసులకు సవాల్గా మారిన సైకో కిల్లర్ రాంబాబును ఎట్టకేలకు అరెస్టు చేశారు. మంగళవారం విశాఖలో ఏర్పాటు చేసిన
విశాఖ: పెందుర్తిలో వరుస హత్యల కేసు మిస్టరీ వీడింది. పోలీసులకు సవాల్గా మారిన సైకో కిల్లర్ రాంబాబును ఎట్టకేలకు అరెస్టు చేశారు. మంగళవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను సీపీ శ్రీకాంత్ వెల్లడించారు. కుటుంబం దూరం కావడంతో ఆడవాళ్లను చంపడమే అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడని సీపీ వివరించారు.
‘‘2018లో రాంబాబు భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు అతడిని దగ్గరకు రానివ్వడం లేదు. అంతే కాక.. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థలో ఏజెంట్గా పనిచేసి మోసానికి గురయ్యాడు. కొంతకాలం ఆటో నడిపాడు. అప్పటి నుంచి మహిళలపై కక్ష పెంచుకున్నాడు. శారీరక వాంఛతో ఆడవాళ్లను చంపడమే లక్ష్యంగా పెట్టుకుని హత్యలకు పాల్పడ్డాడు. ఈనెల 6న అర్ధరాత్రి చినముషిడివాడ సప్తగిరినగర్లో ఓ భవన నిర్మాణం వద్ద కాపలాదారులుగా ఉన్న దంపతులను దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం చనిపోయిన వాళ్లలో మహిళ ఉన్నారా? లేదా? అని తెలుసుకునేందుకు ప్రైవేటు పార్ట్స్ చూసేవాడు. ఆ తరువాత కాలితో తన్నేవాడు. ఈనెల 14న సుజాతనగర్లోని నాగమల్లి లే అవుట్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్కి ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో భార్య, కుమారుడితో కలిసి దేవుడు కుటుంబం నివసిస్తోంది. నిర్మాణంలో ఉన్న మరో భవనం వద్ద దేవుడు కాపలా ఉండగా అతడి భార్య లక్ష్మి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాంబాబు ఇనుపరాడ్డుతో దాడి చేసి హతమార్చాడు. 3 హత్యలతో పాటు మరొకరిపై హత్యాయత్నం చేశాడు. హత్యలన్నింటికీ ఇనుపరాడ్డును వినియోగించాడు. రాడ్డుతో తలపై మోది చంపేవాడు. రాంబాబు వద్ద సెల్ఫోన్ లేకపోవడంతో పట్టుకోవడం కష్టమైంది. నిందితుడు ఆలయాలు, ఫంక్షన్ హాళ్లలో తింటూ కాలక్షేపం చేసేవాడు. గత కొంత కాలంగా నిందితుడి మానసిక స్థితి సరిగాలేదు.. అద్దె ఇంట్లో క్షుద్రపూజలు చేస్తూ వింతగా ప్రవర్తించడంతో యజమాని ఇల్లు ఖాళీ చేయించాడు’’ అని సీపీ వెల్లడించారు. నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్