Pune girl brutal murder: నడిరోడ్డుపై బాలిక హత్య.. మానవత్వానికే సిగ్గుచేటు: అజిత్ పవార్
మహారాష్ట్రలోని పుణెలో 14 ఏళ్ల బాలికను నడిరోడ్డుపై కిరాతకంగా పొడిచి చంపిన ఘటనలో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు
పుణె: మహారాష్ట్రలోని పుణెలో 14 ఏళ్ల బాలికను నడిరోడ్డుపై కిరాతకంగా పొడిచి చంపిన ఘటనలో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమించడం లేదని కక్ష పెంచుకొని 22ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ బాలికను పలుమార్లు పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడితో సహా మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణె పట్టణంలోని బిబేవాడీ ప్రాంతంలో 8వ తరగతి చదివే బాలిక సాయంత్రం పూట కబడ్డీ ప్రాక్టీసుకు వెళ్తుండగా నలుగురు యువకులు బైకుపై వచ్చి దాడి చేశారు. ఇద్దరు బైకుపై ఉండగా మరో ఇద్దరు పదునైన ఆయుధంతో బాలిక గొంతు, ఇతర శరీర భాగాలపై దారుణంగా పొడిచారు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి 22 ఏళ్ల యువకుడు, బాలికకు దగ్గర బంధువైన శుభమ్ భగవత్ను, మరో ముగ్గురిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, ఈ క్రూరమైన ఘటనను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తీవ్రంగా ఖండించారు. నడిరోడ్డుపై బాలిక హత్య అందర్నీ సిగ్గుతో తల దించుకునేలా చేసిందని.. ఇది మానవత్వానికే సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!