Amritsar: తమ నేతను విడిపించేందుకు.. కత్తులు, గన్లతో పోలీస్స్టేషన్పై దాడికి వచ్చారు!
పంజాబ్ (Punjab)లో ఓ మత సంస్థ నాయకుడిని అరెస్టు చేసినందుకు అతడి మద్దతుదారులంతా వీరంగం సృష్టించారు. కత్తులు, గన్లు, పదునైన ఆయుధాలతో పోలీస్స్టేషన్ (police Station) ముట్టడికి బయల్దేరారు.
అమృత్సర్: ఓ వైపు భారీ సంఖ్యలో పోలీసులు.. మరోవైపు కత్తులు, తుపాకులు, పదునైన ఆయుధాలతో వందలాది మంది ఆందోళనకారులు..మధ్యలో బారికేడ్లు..ఈ సీన్ చూస్తుంటే.. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా అనుకునేరు. పంజాబ్లోని అజ్నాలా పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగిన యదార్థ సంఘటన ఇది. ఈ ఆందోళనకారులంతా.. ఆ పోలీస్స్టేషన్ను ముట్టడించేందుకు వచ్చారట. ఎందుకో తెలుసా?
ఆ ఆందోళనకారులంతా పంజాబ్లోని ‘వారిస్ పంజాబ్ దే’ మత సంస్థ చీఫ్ అమృత్పాల్ సింగ్ అనుచరులు. అమృత్పాల్ సింగ్ సన్నిహితుడు లవ్ ప్రీత్ తూఫాన్ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. దీంతో కోపోద్రిక్తులైన అతడి అనుచరులంతా మూకుమ్మడిగా పోలీస్స్టేషన్ను ముట్టడించేందుకు వెళ్లారు. మినీ బస్పై బారీ సౌండ్బాక్సులు పెట్టి.. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. మారణాయుధాలతో ముందుకు సాగారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు రోడ్డు మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. వందలాది మంది ఆందోళనకారులు వాటిని తోసుకుంటూ ముందుకెళ్లేసరికి పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు.
కేవలం రాజకీయ కుట్రతోనే లవ్ప్రీత్ తూఫాన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అమృత్పాల్ సింగ్ ఆరోపించారు. కేవలం గంట లోపు కేసు రద్దు చేయకపోతే తర్వాత ఏం జరిగినా అధికారయంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘‘మేమేం చేయలేమని వాళ్లనుకుంటున్నారేమో. అందుకే బల ప్రదర్శన చేయాల్సి వచ్చింది’’ అని అమృత్పాల్ సింగ్ వెల్లడించారు.‘వారిస్ పంజాబ్ దే’ సంస్థను దీప్ సిద్ధూ అనే వ్యక్తి స్థాపించారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందిన తర్వాత సంస్థ బాధ్యతలను అమృత్పాల్ సింగ్ తీసుకున్నారు. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లవ్ప్రీత్ తూఫాన్ను విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు