Crime News: సికింద్రాబాద్ విధ్వంసంలో అతడిదే కీలక పాత్ర... మరో 10మంది అరెస్టు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్పై దాడి ఘటనలో ప్రమేయం ఉన్న 10మందిని పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే పోలీసులు వారిని విచారించిన అనంతరం పలు సెక్షన్ల కింద కేసులు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్పై దాడి ఘటనలో ప్రమేయం ఉన్న 10మందిని పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే పోలీసులు వారిని విచారించిన అనంతరం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం బోయగూడలోని రైల్వే కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో నిందితులను చంచల్గూడ జైలుకి తరలించారు. అరెస్టయిన 10మందిలో ఐదుగురు వాట్సప్ గ్రూప్ అడ్మిన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఏ2గా ఉన్న ఆదిలాబాద్కు చెందిన పృథ్వీరాజ్ విధ్వంసం ఘటనలో కీలక భూమిక పోషించినట్టు దర్యాప్తులో తేలింది. మొదట అరెస్టు చేసిన 45 మందిలో ఏ1గా మధుసూదన్ను పోలీసులు గుర్తించారు. అతను కూడా పృథ్వీరాజ్తో కలిసి విధ్వంసానికి పాల్పడినట్టు దర్యాప్తులో గుర్తించారు.
వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి అందులో వందల మందిని సభ్యులుగా చేర్చి 17వ తేదీ ఉదయం 8గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు రావాలని ప్రచారం చేశారు. శాంతియుతంగా నిరసనలు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదని, రైల్వే బోగీలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టిస్తేనే కేంద్రం దృష్టికి వెళ్తుందని వాట్సప్ గ్రూపుల్లో సందేశాలు పంపించారు. సామాజిక మాధ్యమాల్లో సందేశాలు, వాట్సప్ గ్రూపుల్లో పోస్టులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత పోలీసులు ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 55 మందిని అరెస్టు చేశారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావుతో పాటు, కరీంనగర్కు చెందిన మరో ఇనిస్టిట్యూట్లో అధ్యాపకుడు రాజశేఖర్ను హైదరాబాద్లోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు. విధ్వంసం కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసుల కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ‘‘17వ తేదీన జరిగిన విధ్వంసానికి ఆవుల సుబ్బారావు మద్దతిస్తున్నట్టు విద్యార్థుల మధ్య చర్చ జరిగింది. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు, మేనేజర్ శివ ఆందోళనకారులకు సహకరించారు. వీరిద్దరూ ఆందోళన కారులకు విధ్వంసకర వస్తువులు అందించారు’’ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?