Saidabad: రాజును పోలీసులే కాల్చి చంపారు: కుటుంబ సభ్యుల ఆరోపణ

సైదాబాద్‌ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య ఘటనతో సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులోని అతని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. పోలీసులే కాల్చి

Updated : 09 Sep 2022 14:37 IST

సూర్యాపేట: సైదాబాద్‌ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య ఘటనతో సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులోని అతని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. పోలీసులే కాల్చి చంపేశారని నిందితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజును చంపి కడుపుకోత మిగిల్చారని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని అప్పగించాలని రాజు తల్లి, భార్య కోరుతున్నారు. రాజు కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో ఈరోజు ఉదయం స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని