పుట్ట మధు: కొనసాగుతున్న విచారణ
హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. రామగుండం పోలీసులు తమ అదుపులో ఉన్న పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధును విచారిస్తున్నారు. అయితే విచారణలో పుట్ట మధు నోరు విప్పలేదన
పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. రామగుండం పోలీసులు తమ అదుపులో ఉన్న పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధును విచారిస్తున్నారు. అయితే విచారణలో పుట్ట మధు నోరు విప్పలేదని సమాచారం. మరోవైపు పోలీసుల నోటీసులతో పుట్ట మధు సతీమణి శైలజ విచారణకు హాజరయ్యారు. సోమవారం మరోమారు విచారణకు రావాలని ఆమెను పోలీసులు ఆదేశించారు. 12 బ్యాంకు ఖాతాల వివరాలతో రావాలని పోలీసులు ఆమెకు సూచించారు. వామన్రావు తండ్రి కిషన్రావును సోమవారం మరోసారి రావాలని పోలీసులు కోరారు.
హత్యకేసులో అసలైన నిందితులను పట్టుకోలేదని వామన్రావు తండ్రి గట్టు కిషన్రావు గత నెల 16న వరంగల్ రేంజ్ ఐజీకి ఫిర్యాదు చేశారు. హత్య జరిగిన రోజున రామగిరి పోలీసులు తన కూతురితో ఫిర్యాదు తీసుకుని, తనతో సంతకం పెట్టించుకున్నారని.. ఆ సమయంలో తాను తీవ్రమైన దుఃఖంలో ఉండి ఫిర్యాదులోని పేర్లను సరిగ్గా చూడలేదని ఆయన తెలిపారు. రాజకీయ కక్షతో పుట్ట మధు హత్య చేయించారని ఆరోపించారు. ఆయన కాల్డేటాను సేకరించి, సమగ్ర విచారణ జరిపితే చాలామంది వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పుట్ట మధును తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.