Road Accident: వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 11 మంది కూలీలకు గాయాలు

పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం వెళ్తున్న కూలీల ఆటోను కారు ఢీ కొట్టిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 27 Dec 2021 17:04 IST

పెబ్బేరు: పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం వెళ్తున్న కూలీల ఆటోను కారు ఢీ కొట్టిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది కూలీలు గాయపడ్డారు. పెబ్బేరు నుంచి పత్తి తీసేందుకు ఇటిక్యాల మండలం షేక్ పల్లికి ఆటోలో 15 మంది కూలీలు బయలుదేరారు. పెబ్బేరు శివారు జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టింది. క్షతగాత్రులను.. అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Read latest Crime News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని