Andhra News: అర్ధరాత్రి తలుపుకొట్టి.. మహిళపై అత్యాచారం!

 ఏపీలోని విజయనగరం జిల్లా ఉడా కాలనీలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న

Updated : 03 May 2022 15:57 IST

విజయనగరం: ఏపీలోని విజయనగరం జిల్లా ఉడా కాలనీలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో ఉంటున్న మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఉపాధి కోసం పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విజయనగరం వచ్చింది. అక్కడే టీ దుకాణంలో పనిచేస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఆమె ఇంటి తలుపుకొట్టిన దుండగుడు.. తలుపు తీయగానే బలవంతంగా లోనికి చొరబడి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు విజయనగరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం: ఎస్పీ

మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్‌ తెలిపారు. ఉడా కాలనీలోని మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె వెల్లడించారు. విజయనగరంలో మీడియాతో ఎస్పీ మాట్లాడారు. బాధితురాలు తన స్నేహితునితో ఇంట్లో ఉండగా.. అక్కడికి ఇద్దరు యువకులు వచ్చారన్నారు. వారిలో ఒకరు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారని తెలిపారు. నిందితుడిని విజయనగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరిపైనా కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ దీపిక చెప్పారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు