Crime news: జాబ్ ఇంటర్వ్యూకు పిలిచి.. కారులోకి ఈడ్చుకెళ్లి యువతిపై దారుణం
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతి జీవితాన్ని నాశనం చేశాడో దుర్మార్గుడు. యువతికి మత్తుమందు కలిపిన నీటిని ఇచ్చి స్పృహకోల్పోగానే కారులోకి ఈడ్చుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు.
గురుగ్రామ్: హరియాణా(Haryana)ని గురుగ్రామ్లో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతిని ఇంటర్వ్యూ కోసం పిలిచిన ఓ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్ పార్కింగ్ లాట్లో ఈ దుర్మార్గం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుషార్ శర్మ అనే వ్యక్తి ఇంటర్వ్యూ(job interview)కు రావాలని పిలిచి తనపై అత్యాచారం చేసినట్టు 27 ఏళ్ల యువతి ఆరోపించింది. సహారా షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి తనను కలవాలని పిలవగా.. తాను అక్కడికి వెళ్లినట్టు బాధితురాలు తెలిపింది. అప్పటికే కుట్ర పన్నిన నిందితుడు.. షాపింగ్ కాంప్లెక్స్లోని పార్కింగ్ లాట్ వద్దకు తీసుకెళ్లి కారులోకి బలవంతంగా ఈడ్చుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్టు వాపోయింది.
ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు..
‘తొలుత ఆన్లైన్ పోర్టల్ ద్వారా యువతికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. తుషార్ మెహతా అనే వ్యక్తిని సంప్రదించాలని సమాచారం అందింది. అతడికి ఫోన్ చేయగా.. ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఆమెను సహారా మాల్కు రావాలని సూచించాడు. ఆమెను మాల్ బయట కలిసి పార్కింగ్ లాట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ యువతికి మత్తుమందు కలిపిన నీటిని తాగేందుకు ఇచ్చాడు. అనంతరం ఆమెను కారులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ సెక్టార్ 51 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు. ఇంటర్వ్యూకు అవసరమైన డాక్యుమెంట్లు తీసుకొని మాల్ వద్దకు చేరుకోగానే.. గేటు వద్ద అతడు తనను కలిసినట్టు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అక్కడి నుంచి తనను పార్కింగ్ లాట్కు తీసుకెళ్లాడని.. నీళ్లు తాగిన అనంతరం తాను స్పృహ కోల్పోగా బలవంతంగా కారులోకి ఈడ్చుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడని యువతి వాపోయింది. ఆ తర్వాత తనను అక్కడే వదిలేసి కారులో పరారయ్యాడని పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం మాల్ వద్ద సీసీటీవీ ఫుటేజీల కోసం ప్రయత్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం