స్థిరాస్తి వ్యాపారి హత్య కేసు: పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు!

నగరంలోని మియాపూర్‌ పరిధిలో జరిగిన స్థిరాస్తి వ్యాపారి భాస్కర్‌రెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

Updated : 12 Aug 2021 14:22 IST

హైదరాబాద్‌: నగరంలోని మియాపూర్‌ పరిధిలో జరిగిన స్థిరాస్తి వ్యాపారి భాస్కర్‌రెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేరళలో తలదాచుకున్న ప్రధాన నిందితుడు త్రిలోక్‌నాథ్‌ బాబాతో పాటు మరో వ్యక్తిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గుప్త నిధులు, స్థిరాస్తి వ్యాపార గొడవలపైనా క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. ఇదే కేసుతో ప్రమేయం ఉన్న మల్లేశ్‌, సుధాకర్‌, కృష్ణంరాజు, ఆర్‌ఎంపీ వైద్యుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని