Crime News: విజయవాడలో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి..!

విజయవాడలో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. పోలీసులే తన భర్తను కొట్టి చంపారని అతడి భార్య, కుటుంబసభ్యులు ఆరోపించారు.

Published : 09 Dec 2021 01:52 IST

విజయవాడ: విజయవాడలో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. పోలీసులే తన భర్తను కొట్టి చంపారని అతడి భార్య, కుటుంబసభ్యులు ఆరోపించారు. విజయవాడకు చెందిన భానుచందర్.. ట్రావెల్స్ వ్యాపారం చేసేవారు. ఆయన కారులో వస్తుండగా ఎ.కొండూరు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం తెలంగాణ మద్యంతో పోలీసులకు పట్టుబడ్డారు. భానుచందర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. రిమాండ్ కోసం నూజివీడు సబ్ జైలుకు తరలించారు. మంగళవారం అతడి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి జీజీహెచ్‌కు తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే మృతి చెందారు. పరీక్షించిన జీజీహెచ్ వైద్యులు..అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. మధుమేహంతో బాధపడుతున్న భానుచందర్‌కు జైల్లో మాత్రలు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. అతడికి వాంతులు, విరోచనాలు అయినట్లు వివరించారు. కుటుంబసభ్యులు మాత్రం పోలీసులే అతడిని కొట్టారని ఆగ్రహం వెలిబుచ్చారు. చనిపోయిన భానుచందర్.. వైకాపా మద్దతుదారు కావడంతో నగరానికి చెందిన పలువురు కార్పొరేటర్లు ఆసుపత్రికి వచ్చి పోస్టుమార్టం చేయడానికి వీల్లేదని అడ్డుకున్నారు. మృతదేహం స్వాధీనం చేసుకొనే విషయంలోనూ మృతుడి బంధువులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Read latest Crime News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని