Maharashtra: నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మృతి

మహరాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయి ఏడుగురు మృతిచెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు

Updated : 29 May 2021 01:23 IST

థానే:  మహరాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయి ఏడుగురు మృతిచెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని