Nizamabad: ఆటోను ఢీకొన్న గూడ్స్‌ ట్రాలీ.. నలుగురు మృతి

నిజామాబాద్‌ శివారులో ఆటోను డీసీఎం ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. 

Published : 27 Apr 2023 19:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిజామాబాద్‌ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బోధన్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చి గూడ్స్‌ ట్రాలీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలి నుంచి గూడ్స్‌ ట్రాలీ డ్రైవర్‌ పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని