Guntur: ప్రత్తిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని తుమ్మలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో

Published : 15 Aug 2022 20:42 IST

ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని తుమ్మలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు మృత్యువాత పడ్డారు. మృతులను కాకినాడకు చెందిన చైతన్య పవన్‌, విజయవాడకు చెందిన గౌతమ్‌ రెడ్డి, విశాఖకు చెందిన సౌమ్యికగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరో యువతి మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. విజయవాడ నుంచి చిలకలూరి పేట వైపు వెళ్తున్న కారు.. రోడ్డు పక్కనే ఆగిన లారీని బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులు గౌతమ్‌ రెడ్డితోపాటు మిగతా ముగ్గురు ఆర్కిటెక్చర్ విద్యార్థులుగా పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని