Road Accident: విజయవాడ బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం

నగరంలోని బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌పై ఓ కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో వచ్చి ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టింది.

Updated : 14 Feb 2022 13:32 IST

విజయవాడ(క్రైమ్‌): విజయవాడ బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌పై ఓ కారు బీభత్సం సృష్టించింది. రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్తున్న కారు అధిక వేగంతో వచ్చి ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజరాజేశ్వరిపేటకు చెందిన షేక్‌ నాగూర్‌బీ (35) మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిలో వేముల వెంకటలక్ష్మి (ప్రకాశ్‌నగర్‌), లంక జయకుమారి (సింగ్‌ నగర్‌), దుర్గా జయభవాని(సింగ్‌ నగర్‌), వెంకటేశ్వరరావు (నున్న) ఉన్నారు. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కారు నడిపిన వ్యక్తిని పటమట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని