Crime news: 2 బైకులను ఢీ కొన్న గుర్తుతెలియని వాహనం.. ఇద్దరి మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రెండు బైకులను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Published : 03 Oct 2022 22:18 IST

రంపచోడవరం: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పెదగిద్దాడ గ్రామ శివారులో రెండు ద్విచక్రవాహనాలను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో వలల ప్రకాశ్‌(17), కె.తేజ(13) అక్కడికక్కడే మృతి చెందారు. వలల బుల్లయ్య అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా రంపడచోడవరం మండల ఆనంపల్లి గ్రామానికి చెందిన వారు. సోమవారం మధ్యాహ్నం సీతపల్లిలోని బాపనమ్మ తల్లిని దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వెనక నుంచి ఢీకొంది. బుల్లయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్‌కుమార్‌ తెలిపారు. ప్రకాశ్ ఇంటర్మీడియట్‌, తేజ ఎనిమిదో తరగతి చదువుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు