Accident: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఈ సంఘటన గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక

Updated : 03 Aug 2021 00:55 IST

గుత్తి: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఈ సంఘటన గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు. లారీ రాంగ్‌రూట్‌లో ఎదురుగా వచ్చి కారును ఢీకొట్టింది. కారు అనంతపురం నుంచి కర్నూలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని