Crime news: కారు టైరు పేలి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం జ్వాలపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారుఅనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం జ్వాలపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు.

Updated : 31 Oct 2021 01:46 IST

అనంతపురం: అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం జ్వాలపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఓ కుటుబం కారులో వివాహ కార్యక్రమానికి అనంతపురం వెళ్తుండగా ఈప్రమాదం చోటు చేసుకుంది. కారు ముందు టైరు పేలడంతో అదుపుతప్పి అనంతపురం నుంచి చెన్నై వెళ్తున్న లారీని కారు ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అమ్మాజి(50), కుమారుడు రెడ్డి భాషా(25), కుమార్తె రేష్మ(30), అల్లుడు బాబు(36) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. బాబు, రేష్మల కుమార్తె జస్మిత(5)కు తీవ్ర గాయాలయ్యాయి. బాలికను చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు కారులో చిక్కుకు పోవడంతో పోలీసులు స్థానికుల సాయంతో బయటకు తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని