Road Accident: ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు వద్ద ప్రమాదం.. పలువురి మృతి!

ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Updated : 19 Mar 2022 11:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడిన ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కర్ణాటకలోని పావగడ పలవలహళ్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. వై.ఎన్‌.హొసకోట నుంచి పావగడకు బస్సు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న బస్సు టాప్‌పై ఎక్కువ మంది డిగ్రీ విద్యార్థులున్నట్లు సమాచారం. మృతుల్లో టాప్‌పై నుంచి దూకిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో ఏపీకి చెందిన షాన్‌వాజ్‌(20) మృతి చెందారు. కంబదూరు మండలం బెస్తరపల్లిలో ఇతను మెకానిక్‌గా పని చేసేవాడని గుర్తించారు. మృతుల్లో కర్ణాటక వాసులు అమూల్య(20), అంజిత్‌(23), కల్యాణ్‌(27) ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు