Road Accident: కల్వర్టును ఢీకొని చెరువులో పడిన కారు.. నలుగురు మృతి

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె గ్రామీణం పరిధిలోని పుంగనూరు రోడ్డులో కారు కల్వర్టును ఢీకొట్టి

Updated : 26 May 2022 12:21 IST

మదనపల్లె గ్రామీణం: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె గ్రామీణం పరిధిలోని పుంగనూరు రోడ్డులో మొరవపల్లె వద్ద కారు కల్వర్టును ఢీకొట్టి చెరువులో పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పుంగనూరు రోడ్డులోని 150 మైలు వద్ద ఈ ఘటన జరిగింది.

మృతిచెందిన వారిని దంపతులు గంగిరెడ్డి, మధులత.. వారి పిల్లలు కుషిరెడ్డి, దేవాన్ష్‌రెడ్డిగా గుర్తించారు. వీరిది నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లె. పలమనేరులో పెళ్లి కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని