Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ బోల్తా పడి ఆరుగురు మృతి

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ బోల్తా పడి ఆరుగురు మృతి చెందారు.

Updated : 07 Dec 2022 23:03 IST

చిత్తూరు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ బోల్తా పడి ఆరుగురు మృతి చెందారు. 17 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పూతలపట్టు మండలం జట్టిపల్లిలో ట్రాక్టర్‌పై పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తిరుపతి స్విమ్స్‌, వేలూరు సీఎంసీకి తరలించారు. మృతులు ఐరాల మండలం బలిజపల్లికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బలిజపల్లికి చెందిన 26 మంది ట్రాక్టర్‌లో ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని