Guntur: ట్రాక్టర్‌ బోల్తా: ఏడుగురు మహిళలు మృతి.. 20 మందికి గాయాలు

ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మహిళా కూలీలు మృతిచెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 05 Jun 2023 16:34 IST

వట్టిచెరుకూరు: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు మృతిచెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోయారు. ట్రాక్టర్‌లో సుమారు 40 మంది చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను ప్రత్తిపాడు మండలం కొండెపాడు వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. మృతులను నాగమ్మ, మేరమ్మ, రత్నకుమారి, నిర్మల సుహాసిని, ఝాన్సీరాణి, సలోమిగా గుర్తించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని