Hyd News: మాదాపూర్లో కారు బీభత్సం: బైక్ను ఢీకొట్టి.. సెల్లార్లోకి దూసుకెళ్లి..
నగరంలోని మాదాపూర్లో కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో సాయినగర్లో బైక్ను ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో సాయినగర్లో బైక్ను ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని మాదాపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
బైక్ను ఢీకొట్టిన అనంతరం కారు రోడ్డు పక్కన ఓ అపార్ట్మెంట్ సెల్లార్లోకి దూసుకెళ్లింది. ఈ తెల్లవారుజామున ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారు డ్రైవర్ సాయి కృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!